Header Banner

Liquor Scam Case: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం..! వాదోపవాదాలను విన్న అనంతరం కోర్టు..!

  Tue Jun 17, 2025 16:34        Politics

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న మాజీ ఐఎఎస్ అధికారి కే ధనంజయ రెడ్డి, పీ కృష్ణమోహన్ రెడ్డితో అయిదు మంది నిందితులకు విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. జులై 1వ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు.
ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసుల కస్టడీలో ఉంటోన్నారు. మద్యం కేసు విచారణను ఎదుర్కొంటోన్నారు. వారి రిమాండ్ ముగియాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉదయం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

వాదోపవాదాలను విన్న అనంతరం కోర్టు.. ఈ ఏడుమంది నిందితుల జ్యుడీషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతోన్న మద్యం కుంభకోణం కేసులో ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఏ31, ఏ32గా ఉన్నారు.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..


దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతంలో విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీకి చెందిన కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి.. సిట్ విచారణకు హాజరయ్యారు కూడా. తమ వివరణలను ఇచ్చుకున్నారు. ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తొలుత అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది.

ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. మూడు రోజుల పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. అదే సమయంలో ముందస్తు బెయిల్ పిటీషన్ కూడా దాఖలు చేసుకున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వాళ్లు దాఖలు చేసుకున్న పిటీషన్ ను కొట్టివేసింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LiquorScamCase #APLiquorScam #CourtUpdate #MajorDevelopment #AndhraPradeshNews #CorruptionCase #LegalProceedings